Telangana Vana mahotsavam 2026–27: Statewide tree plantation drive for a green Telangana
తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా మొక్కల నాటకం
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వనమహోత్సవం–2026–27 కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంట, ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు. ప్రజల భాగస్వామ్యంతో పచ్చని తెలంగాణను నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి
వనమహోత్సవంలో విద్యార్థులు, మహిళా సంఘాలు, రైతులు, యువజన సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు చురుకుగా పాల్గొంటున్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. నాటిన ప్రతి మొక్కను జీవించి పెరిగేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు పచ్చదనం విస్తరణ అత్యవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. మొక్కలు గాలి నాణ్యతను మెరుగుపరచడంతో పాటు భూగర్భ జలాల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రజలకు పిలుపు
ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, వనమహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరింది.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి